ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం..
- December 19, 2016
మనామా: ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, పోర్టిఫోలియో మేనేజర్ పిఆర్ దిలీప్, బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలపై జరిగిన సెమినార్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని అన్నారు. గత 20 ఏళ్ళుగా భారతదేశం ఎలాంటి రెసిషన్ ఎఫెక్ట్ని ఎదుర్కొనలేదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం రికార్డులకెక్కిందని ఆయన చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన పలు దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నా ఆ ప్రభావం భారతదేశంపై పడలేదని ఆయన తెలిపారు. భారతదేశంలో సమర్థవంతమైన ఫైనాన్షియల్ మార్కెట్ ఉందని, ఈ సదవకాశాన్ని ఇన్వెస్టర్లు వినియోగించుకోవాలని కోరారాయన. దేశ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం జరిగిందనీ, ఈ ప్రభావంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని బహ్రెయిన్ పర్యటనలో ఉన్న మరో ఆర్థిక నిపుణుడు దిలీప్ చెప్పారు. గ్రోత్ రేట్ పరంగా దేశం కొత్త రికార్డుల్ని సృష్టించబోతోందని వక్తలు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ యూఏఈ, సిరియాకు రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- ఈజీ మనీ కోసం మహిళ అదిరిపోయే స్కెచ్..
- రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ విప్లవం
- ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
- NATS ఆధ్వర్యంలో ‘హైవే దత్తత’ కార్యక్రమం
- కర్ణాటకలో విదేశీ మహిళ పై దాడి
- ప్రాంతీయ సంక్షోభాలను అంతం చేయడానికి దౌత్యమే ఏకైక మార్గం..!!
- యునెస్కో-సుల్తాన్ హైథమ్ బహుమతి..సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు గుర్తింపు..!!
- యూఏఈ లాటరీ: తాజా డ్రా విజేతల సంఖ్యలు.. ఎవరికీ దక్కని జాక్పాట్..!!
- 10 ఏళ్ల జైలు శిక్ష, 10 మిలియన్ల సౌదీ రియాల్స్ జరిమానా..!!









