ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం..

- December 19, 2016 , by Maagulf
ఇండియాలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణం..

మనామా: ఫైనాన్షియల్‌ ఎక్స్‌పర్ట్‌, పోర్టిఫోలియో మేనేజర్‌ పిఆర్‌ దిలీప్‌, బహ్రెయిన్‌ పర్యటనలో భాగంగా ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్‌ అవకాశాలపై జరిగిన సెమినార్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో పెట్టుబడులకు ఇదే మంచి తరుణమని అన్నారు. గత 20 ఏళ్ళుగా భారతదేశం ఎలాంటి రెసిషన్‌ ఎఫెక్ట్‌ని ఎదుర్కొనలేదని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారతదేశం రికార్డులకెక్కిందని ఆయన చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన పలు దేశాలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్నా ఆ ప్రభావం భారతదేశంపై పడలేదని ఆయన తెలిపారు. భారతదేశంలో సమర్థవంతమైన ఫైనాన్షియల్‌ మార్కెట్‌ ఉందని, ఈ సదవకాశాన్ని ఇన్వెస్టర్లు వినియోగించుకోవాలని కోరారాయన. దేశ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పెద్ద పాత నోట్ల రద్దు నిర్ణయం జరిగిందనీ, ఈ ప్రభావంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక రంగం కొత్త పుంతలు తొక్కుతుందని బహ్రెయిన్‌ పర్యటనలో ఉన్న మరో ఆర్థిక నిపుణుడు దిలీప్‌ చెప్పారు. గ్రోత్‌ రేట్‌ పరంగా దేశం కొత్త రికార్డుల్ని సృష్టించబోతోందని వక్తలు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com