ఈ-మెయిల్ అడ్రస్ ఇక తెలుగులోనే!
- December 22, 2016
న్యూదిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్, జయపురకు చెందిన డేటామెయిల్తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ రూపొందించుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఈ మేరకు డేటామెయిల్తో ఒప్పందం చేసుకుంది.
'దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చాలన్నది ప్రధాని మోదీ ఆశయం. ఇందులో భాగంగా ఎనిమిది భారతీయ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ను బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు రూపొందించుకోవచ్చు. ఇక నుంచి వారు తమ మాతృభాష, ప్రాధాన్యం ఉన్న భాషలో ఈ-మెయిల్ అడ్రస్ను సృష్టించుకోవచ్చు' అని బీఎస్ఎన్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ ఓ ప్రకటనలో తెలిపారు.
మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ-మెయిల్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్టోర్లలో డేటా మెయిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ సదుపాయాన్ని పొందవచ్చు. హిందీ, గుజరాతీ, ఉర్దూ, పంజాబీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ-మెయిల్ అడ్రస్ రూపొందించుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ (వినియోగదారుల సేవలు)ఎన్కే గుప్తా తెలిపారు.
తాజా వార్తలు
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?







