ట్రక్కు అడుగు భాగంలో దాక్కొని ఇరువురు యు.ఏ.ఈ లో ప్రవేశ యత్నం
- December 22, 2016
మిఠాయి బుట్టలో దాక్కొని ..మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ రాజభటులకు మస్కా కొట్టి కారాగారం నుంచి తప్పించుకున్న కథ బహుశా వారికి ప్రేరణ అయిందేమో..దాదాపు అదే ఉత్సాహంతో ఇరువురు వ్యక్తులు యు.ఏ.ఈ లోనికి అక్రమ వలస కోసం వింత ప్రయత్నం చేశారు..అయితే వీరికి తుదకు వంటి నిండా మసి తో పాటు పలు కేసులు మాత్రమే మిగిలాయి. వీరు ఒక డ్రైవర్ సహకారంతో ట్రక్కు అడుగు భాగంలో టైర్లను దాచే స్థలంలో కిక్కురుమనకుండా నక్కి కూర్చొన్నారు. వారి ప్రణాళిక ప్రకారమే రహస్యంగా యు.ఏ.ఈ లోనికి ప్రవిశించారు. అయితే, ఎమిరేట్ ప్రయాణమై వెళుతున్న ఒక అరబ్ డ్రైవర్ వ్యవహారశైలి కదలికలపై అనుమానం కల్గిన అధికారులు మేజయాద్ కస్టమ్స్ కేంద్రంలో మానవ శోధన మరియు ఆధునిక డిటెక్టరలతో ట్రక్కు అంతా క్షుణ్ణంగా అబూధాబీ కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేశారు. వారి పరిశోధనలో ఎటువంటి గుర్తింపు పత్రాలు లేకుండా ట్రక్ అడుగు భాగం కింద విడి టైర్లు చాచే ప్రదేశంలో దాక్కొని ఉన్న ఇద్దరు అక్రమ వలసదారులను పట్టుకొన్నారు. అక్రమ వలసదారుల బదిలీ తరలింపునకు ప్రధాన సూత్రధారి డ్రైవర్ పై అవసరమైన అన్ని చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కస్టమ్స్ అధికారులు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







