వర్క్‌ సైట్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి

- December 23, 2016 , by Maagulf
వర్క్‌ సైట్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి

మనామా: సల్మాబాద్‌లో పనిచేస్తున్న ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. బాలింగ్‌ మిషన్‌ ఆ కార్మికుడి మృతికి కారణంగా తెలియవస్తోంది. 40 ఏళ్ళ అనిల్‌కుమార్‌, బాలింగ్‌ మెషీన్‌ని క్లీన్‌ చేస్తుండగా, ప్రమాదవశాత్తూ అందులోపడి మరణించాడు. మెషీన్‌ ఆఫ్‌ చేసి, క్లీనింగ్‌ కోసం అనిల్‌కుమార్‌ అందులోకి వెళ్ళగా, సెన్సార్లు ఆటోమేటిక్‌గా పనిచెయ్యడంతో, మెషీన్‌ రన్‌ అయ్యింది. అది తెలుసుకున్న అనిల్‌కుమార్‌ అందులోంచి బయటకు దూకేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కుమార్‌ సోదరుడు కూడా బహ్రెయిన్‌లోనే నివసిస్తున్నాడు. అనిల్‌కుమార్‌ పనిచేస్తున్న సంస్థ, అతని పార్టీవ శరీరాన్ని ఇండియాకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com