'మన్ కీ బాత్' లో అవినీతిపై సందేశమిచ్చిన మోదీ.!
- December 25, 2016పెద్దనోట్ల రద్దుతో అవినీతిపై యుద్ధం ప్రారంభించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అవినీతిని అంతమొందించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా సందేశమిచ్చిన ప్రధాని.. ముందుగా దేశ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అవినీతి, నల్లధనంపై మా ప్రభుత్వం యుద్ధం ప్రారంభించింది. పెద్దనోట్ల రద్దును దేశ ప్రజలు స్వాగతించారు. ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ అనేక మంది లేఖలు రాశారు.
దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహంచే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే నేటి నుంచి ' లక్కీ గ్రాహక్ యోజన' ప్రారంభిస్తున్నాం. వ్యాపారుల కోసం డిజి- ధన యోజన్కు శ్రీకారం చుడుతున్నాం. దేశంలో కొద్దిరోజుల నుంచి 200-300 శాతం నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా 30 కోట్ల రూపే కార్డులు ఉండగా.. జన్ధన్ ఖాతాలు ఉన్నవారి వద్దే 20 కోట్ల రూపే కార్డులున్నాయి. డిజిటల్ మార్పు యువత సహా అంకుర సంస్థలకు సువర్ణావకాశం లాంటిది' అని ప్రధాని అన్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ