రూ.999కే గో ఎయిర్ విమాన టికెట్
- December 25, 2016
దేశీయ విమానయాన సంస్థ గో ఎయిర్ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.999కే విమాన టికెట్ను ప్రయాణీకులకు అందించనుంది. 2016 ముగింపు సందర్భంగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గో ఎయిర్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం జనవరి 9 2017, ఏప్రిల్ 15, 2017 మధ్య ప్రయాణించే వారు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అయితే ఎన్ని సీట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయో మాత్రం సంస్థ చెప్పలేదు. .
మరోపక్క ఇండిగో సైతం రూ.999కే విమాన టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే కేవలం ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అదీ హైదరాబాద్-బెంగళూరు రూట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జయపుర-పుణె మధ్య రూ.2,317.. దిల్లీ-గువహటి మధ్య రూ.2,534.. దిల్లీ-గోవా మధ్య రూ.3,116లుగా టికెట్ ధరలను నిర్ణయించారు.
ఎయిర్ ఏషియా సైతం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.917కే టికెట్ను పొందవచ్చు. మార్చి 1, 2017, నుంచి అక్టోబర్ 31, 2017 మధ్య ప్రయాణించే వారికి ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









