రూ.999కే గో ఎయిర్‌ విమాన టికెట్‌

- December 25, 2016 , by Maagulf
రూ.999కే గో ఎయిర్‌ విమాన టికెట్‌

దేశీయ విమానయాన సంస్థ గో ఎయిర్‌ క్రిస్మస్‌ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.999కే విమాన టికెట్‌ను ప్రయాణీకులకు అందించనుంది. 2016 ముగింపు సందర్భంగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గో ఎయిర్‌ ప్రకటించిన ఆఫర్‌ ప్రకారం జనవరి 9 2017, ఏప్రిల్‌ 15, 2017 మధ్య ప్రయాణించే వారు తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అయితే ఎన్ని సీట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయో మాత్రం సంస్థ చెప్పలేదు. .

మరోపక్క ఇండిగో సైతం రూ.999కే విమాన టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

అయితే కేవలం ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 25 వరకు అదీ హైదరాబాద్‌-బెంగళూరు రూట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జయపుర-పుణె మధ్య రూ.2,317.. దిల్లీ-గువహటి మధ్య రూ.2,534.. దిల్లీ-గోవా మధ్య రూ.3,116లుగా టికెట్‌ ధరలను నిర్ణయించారు.
ఎయిర్‌ ఏషియా సైతం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.917కే టికెట్‌ను పొందవచ్చు. మార్చి 1, 2017, నుంచి అక్టోబర్‌ 31, 2017 మధ్య ప్రయాణించే వారికి ఇది వర్తిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com