రూ.999కే గో ఎయిర్ విమాన టికెట్
- December 25, 2016
దేశీయ విమానయాన సంస్థ గో ఎయిర్ క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.999కే విమాన టికెట్ను ప్రయాణీకులకు అందించనుంది. 2016 ముగింపు సందర్భంగా ఇప్పటికే పలు విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా గో ఎయిర్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం జనవరి 9 2017, ఏప్రిల్ 15, 2017 మధ్య ప్రయాణించే వారు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అయితే ఎన్ని సీట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయో మాత్రం సంస్థ చెప్పలేదు. .
మరోపక్క ఇండిగో సైతం రూ.999కే విమాన టికెట్ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే కేవలం ఈ ఆఫర్ డిసెంబర్ 25 వరకు అదీ హైదరాబాద్-బెంగళూరు రూట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జయపుర-పుణె మధ్య రూ.2,317.. దిల్లీ-గువహటి మధ్య రూ.2,534.. దిల్లీ-గోవా మధ్య రూ.3,116లుగా టికెట్ ధరలను నిర్ణయించారు.
ఎయిర్ ఏషియా సైతం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.917కే టికెట్ను పొందవచ్చు. మార్చి 1, 2017, నుంచి అక్టోబర్ 31, 2017 మధ్య ప్రయాణించే వారికి ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







