దుబాయ్లో రోడ్డు ప్రమాదాలు: 28 మందికి గాయాలు..
- December 26, 2016
దుబాయ్లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 28 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మొదటి రోడ్డు ప్రమాదంలో 26 మంది గాయపడగా, రెండో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఎమిరేట్స్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఏడుగురు ఓ మోస్తరు గాయాలతో బయటపడ్డారు. మిగిలినవారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. ఉదయం 6.40 నిమిషాల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిట్సుబిషి వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. మరో రోడ్డు ప్రమాదం తెల్లవారుఝామున 5 గంటలకు జరిగింది. వాహనాన్ని అతివేగంగా నడుపుతూ ఎలక్ట్రిసిటీ పోల్ని ఢీకొన్నాడు డ్రైవర్. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రసీద్ ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు వాహనాల్ని నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనీ, వేగ నియంత్రణ పాటించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







