భారత్ లోని ఆయా ఇంటిని సందర్శించిన బహ్రేయినీ విదేశాంగ మంత్రి ..

- December 27, 2016 , by Maagulf
భారత్ లోని ఆయా ఇంటిని సందర్శించిన బహ్రేయినీ విదేశాంగ మంత్రి ..

 శ్రీ కృష్ణుడికి కుచేలుడు అటుకులు తీసుకువెళ్లి తనను గుర్తు పడతాడే లేదోనని సంశయిస్తే , స్వయంగా ఆ  శ్రీ కృష్ణుడే ఎదురొచ్చి పలకరించి...తాను తీసుకొచ్చినవి ఇష్టంగా తింటుంటే కుచేలునికి కల్గిన అనుభవమే వయసు పైబడిన ఆ ముదుసలి ఆయమ్మకు ఎదురైంది. ఆప్యాయతుల ముందు పదవులు  భేషజాలు ఆయనకు అడ్డు రాలేదు..ఎదిగిన కొద్దీ.ఒదగాలనే గెలుపు సూత్రంను ఒంట పట్టించుకున్నారాయన .. తన ఇంట్లో 21 ఏళ్ళ పాటు పనిచేసిన భారత మహిళ ఇంటిని సందర్శించిన బహ్రేయినీ విదేశాంగ మంత్రి  షేక్ ఖలీద్ బిన్ అహ్మద్ అల్ ఖలీఫా  తన ఔదార్యం చాటుకున్నాడు  భారతదేశంలో కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాకు చెందిన లయల ఇంటిని ఆయన ఇటీవల సందర్శించి ఆమెను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఈ సందర్భంగా ఆ అనుభూతిని అభివర్ణస్తూ, తమని ఎంతో ప్రేమతో పెంచిందని 21 సంవత్సరాల పాటు  ప్రేమ, నిజాయితీ మరియు విధేయత పంచుతూ తన జీవితాన్ని మాతో పంచుకున్నారని పాత జ్ఞాపకాలను  రాయబారికి రాసిన  లేఖలో పేర్కొన్నారు.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com