స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు..
- December 28, 2016
స్కూలు బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ బస్సుల్లో స్కూళ్ళకు వెళ్తున్న పిల్లలకు బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, క్లీనర్లు అసభ్య చిత్రాలను, కంటెంట్ ను చూపుతున్నారని సుప్రీం కోర్టు మహిళా లాయర్ల సంఘం కోర్టులో వేసిన తన పిటిషన్ లో పేర్కొంది. ఇది పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, దీన్ని నివారించేలా చూడాలని కోరింది.
దీంతో అన్ని స్కూళ్ళు తమ బస్సుల్లో ఇంటర్నెట్ జామర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. అయితే బడుల ప్రాంగణాల్లో ఇలా జామర్లు ఏర్పాటు చేయలేమని మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విద్యార్థుల కంప్యూటర్లకు ఇది అడ్డు పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఢిల్లీ వంటి నగరాల్లో స్కూలు బస్సుల్లో సిబ్బంది తమ సెల్ ఫోన్లలో విద్యార్థులకు అశ్లీల చిత్రాలను, కంటెంటును చూపుతున్న వైనం పై సుప్రీంకోర్టు మహిళా లాయర్లు ఆందోళన వ్యక్తంచేస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.
తాజా వార్తలు
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!









