కూకట్పల్లిలో ఓలా క్యాబ్ డ్రైవర్లు ఆందోళన
- December 29, 2016
నగరంలోని కూకట్పల్లి ఓలా క్యాబ్ కార్యాలయం వద్ద డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. సమస్యలపై యాజమాన్యాన్ని కలిసేందుకు వచ్చిన డ్రైవర్లపై బౌన్సర్లు దాడిచేశారు. ఆగ్రహించిన డ్రైవర్లు బౌన్సర్లను పట్టుకుని చితకబాదారు. దీంతో ఉద్రిక్తవాతావరణం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గీయులను చెదరగొట్టారు. డ్రైవర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా వాహనాల సంఖ్య పెరిగింది. ఓలా క్యాబ్స్ ఇచ్చిన వాహనాలు సరిగ్గా నడవకపోవడం, అదే విధంగా డ్రైవర్లు డబ్బులు సరిగ్గా చెల్లించకపోవడంతో యాజమాన్యం బాగా ఒత్తిడి తీసుకొచ్చింది. ట్రిప్పుల విషయంలో తేడా వచ్చిందని ఓనర్లు చెబుతున్నారు. సుమారు 1000మంది డ్రైవర్లు ఆఫీసుకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







