కతార్ లో ప్రైవేటు పాఠశాల ఫీజుల పెంపు: తల్లిదండ్రుల ఆందోళన
- September 09, 2015
కతార్ లో ప్రైవేటు పాఠశాల ల్లో ఫీజుల పెంపకంపై ముఖ్యంగా ప్రవాసీయులైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్. ఈ. సి. వారు కొన్ని పాఠశాలలకు 2 నుండి 10 శాతం పెరుగుదలను అనుమతినివ్వగా, వీనిలో భారతీయ పాఠశాలలు విద్యాసంవత్సరం మొదలైన ఏప్రిల్ నెల నుండి పెంపుదలను అమలు చేస్తుండగా, అంతర్జాతీయ పాఠశాలలు వారి కొత్త సెషన్ మొదలైన ఈ నెలనుండి అమలుచేస్తున్నాయి. ఏది ఏమైనా, పాఠశాలలు చెప్పిన పెరిగిన ఉపాధ్యాయుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు, బాంకు రుణాల చెల్లింపు వంటి వాటిని తల్లిదండ్రులు ఒట్టి సాకులుగా కొట్టి పారవేశారు; అనుమతి పొందినప్పటికీ, పెరిగిన మొత్తం అన్యాయమనీ, పాఠశాలలు అందిస్తున్న సేవల క్వాలిటీ లో ఏ పెంపుదల లేదని వారు వాపోతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ పెంపుదల అన్యాయమని, తప్పనిసరి ఐతే- ప్రస్తుత నెలనుంది పెంచాలి కానీ పూర్తి సంవత్సరానికి పెంచడం అన్యాయమని ఎస్. ఈ. సి. వారు తక్షణమే కలుగచేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







