కతార్ లో ప్రైవేటు పాఠశాల ఫీజుల పెంపు: తల్లిదండ్రుల ఆందోళన
- September 09, 2015
కతార్ లో ప్రైవేటు పాఠశాల ల్లో ఫీజుల పెంపకంపై ముఖ్యంగా ప్రవాసీయులైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్. ఈ. సి. వారు కొన్ని పాఠశాలలకు 2 నుండి 10 శాతం పెరుగుదలను అనుమతినివ్వగా, వీనిలో భారతీయ పాఠశాలలు విద్యాసంవత్సరం మొదలైన ఏప్రిల్ నెల నుండి పెంపుదలను అమలు చేస్తుండగా, అంతర్జాతీయ పాఠశాలలు వారి కొత్త సెషన్ మొదలైన ఈ నెలనుండి అమలుచేస్తున్నాయి. ఏది ఏమైనా, పాఠశాలలు చెప్పిన పెరిగిన ఉపాధ్యాయుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు, బాంకు రుణాల చెల్లింపు వంటి వాటిని తల్లిదండ్రులు ఒట్టి సాకులుగా కొట్టి పారవేశారు; అనుమతి పొందినప్పటికీ, పెరిగిన మొత్తం అన్యాయమనీ, పాఠశాలలు అందిస్తున్న సేవల క్వాలిటీ లో ఏ పెంపుదల లేదని వారు వాపోతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ పెంపుదల అన్యాయమని, తప్పనిసరి ఐతే- ప్రస్తుత నెలనుంది పెంచాలి కానీ పూర్తి సంవత్సరానికి పెంచడం అన్యాయమని ఎస్. ఈ. సి. వారు తక్షణమే కలుగచేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!









