కతార్ లో ప్రైవేటు పాఠశాల ఫీజుల పెంపు: తల్లిదండ్రుల ఆందోళన

- September 09, 2015 , by Maagulf
కతార్ లో ప్రైవేటు పాఠశాల ఫీజుల పెంపు: తల్లిదండ్రుల ఆందోళన

కతార్ లో ప్రైవేటు పాఠశాల ల్లో ఫీజుల పెంపకంపై ముఖ్యంగా ప్రవాసీయులైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్. ఈ. సి. వారు కొన్ని పాఠశాలలకు 2 నుండి 10 శాతం పెరుగుదలను అనుమతినివ్వగా, వీనిలో భారతీయ పాఠశాలలు విద్యాసంవత్సరం మొదలైన ఏప్రిల్ నెల నుండి పెంపుదలను అమలు చేస్తుండగా, అంతర్జాతీయ పాఠశాలలు వారి కొత్త సెషన్ మొదలైన ఈ నెలనుండి అమలుచేస్తున్నాయి. ఏది ఏమైనా, పాఠశాలలు చెప్పిన పెరిగిన ఉపాధ్యాయుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు, బాంకు రుణాల చెల్లింపు వంటి వాటిని తల్లిదండ్రులు ఒట్టి సాకులుగా కొట్టి పారవేశారు; అనుమతి పొందినప్పటికీ, పెరిగిన మొత్తం అన్యాయమనీ, పాఠశాలలు అందిస్తున్న సేవల క్వాలిటీ లో ఏ పెంపుదల లేదని వారు వాపోతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ పెంపుదల అన్యాయమని, తప్పనిసరి ఐతే- ప్రస్తుత నెలనుంది పెంచాలి కానీ పూర్తి సంవత్సరానికి పెంచడం అన్యాయమని ఎస్. ఈ. సి.  వారు తక్షణమే కలుగచేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com