కతార్ లో ప్రైవేటు పాఠశాల ఫీజుల పెంపు: తల్లిదండ్రుల ఆందోళన
- September 09, 2015
కతార్ లో ప్రైవేటు పాఠశాల ల్లో ఫీజుల పెంపకంపై ముఖ్యంగా ప్రవాసీయులైన తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్. ఈ. సి. వారు కొన్ని పాఠశాలలకు 2 నుండి 10 శాతం పెరుగుదలను అనుమతినివ్వగా, వీనిలో భారతీయ పాఠశాలలు విద్యాసంవత్సరం మొదలైన ఏప్రిల్ నెల నుండి పెంపుదలను అమలు చేస్తుండగా, అంతర్జాతీయ పాఠశాలలు వారి కొత్త సెషన్ మొదలైన ఈ నెలనుండి అమలుచేస్తున్నాయి. ఏది ఏమైనా, పాఠశాలలు చెప్పిన పెరిగిన ఉపాధ్యాయుల వేతనాలు, నిర్వహణ ఖర్చులు, బాంకు రుణాల చెల్లింపు వంటి వాటిని తల్లిదండ్రులు ఒట్టి సాకులుగా కొట్టి పారవేశారు; అనుమతి పొందినప్పటికీ, పెరిగిన మొత్తం అన్యాయమనీ, పాఠశాలలు అందిస్తున్న సేవల క్వాలిటీ లో ఏ పెంపుదల లేదని వారు వాపోతున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఈ పెంపుదల అన్యాయమని, తప్పనిసరి ఐతే- ప్రస్తుత నెలనుంది పెంచాలి కానీ పూర్తి సంవత్సరానికి పెంచడం అన్యాయమని ఎస్. ఈ. సి. వారు తక్షణమే కలుగచేసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







