యశ్చోప్రా 4వ జాతీయ అవార్డు కైవసం చేసుకున్న షారుక్
- December 30, 2016
యశ్చోప్రా 4వ జాతీయ అవార్డును బాలీవుడ్ బాద్షా షారుక్ఖానకు ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు టి.సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. దివంగత యశచోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మిని కొల్హాపురి, బోనీకపూర్లతో కూడిన కమిటీ ఈ ఏడాది అవార్డ్కుగానూ షారుక్ను ఎంపిక చేసింది. యశ్చోప్రా మరణం తర్వాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును టి.ఎస్.ఆర్ ఫౌండేషన్ పేరుపై ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవార్డు గ్రహీతకు రూ.10 లక్షల నగదు, బంగారు పతకం, ప్రశంస పత్రం అందజేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ముంబైలోని ఓ హోటల్లో అవార్డు వేడుకను నిర్వహిస్తున్నట్లు సుబ్మరామిరెడ్డి తెలిపారు. గతంలో గాయని లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ ఈ అవార్డును అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, రేఖ, సల్మాన్ ఖాన్, అమీర్ఖాన్, శ్రీదేవి, రాణీముఖర్జీ, జయప్రద, ఐశ్వర్యరాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







