యశ్చోప్రా 4వ జాతీయ అవార్డు కైవసం చేసుకున్న షారుక్
- December 30, 2016
యశ్చోప్రా 4వ జాతీయ అవార్డును బాలీవుడ్ బాద్షా షారుక్ఖానకు ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు టి.సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. దివంగత యశచోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మిని కొల్హాపురి, బోనీకపూర్లతో కూడిన కమిటీ ఈ ఏడాది అవార్డ్కుగానూ షారుక్ను ఎంపిక చేసింది. యశ్చోప్రా మరణం తర్వాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును టి.ఎస్.ఆర్ ఫౌండేషన్ పేరుపై ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవార్డు గ్రహీతకు రూ.10 లక్షల నగదు, బంగారు పతకం, ప్రశంస పత్రం అందజేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ముంబైలోని ఓ హోటల్లో అవార్డు వేడుకను నిర్వహిస్తున్నట్లు సుబ్మరామిరెడ్డి తెలిపారు. గతంలో గాయని లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ ఈ అవార్డును అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, రేఖ, సల్మాన్ ఖాన్, అమీర్ఖాన్, శ్రీదేవి, రాణీముఖర్జీ, జయప్రద, ఐశ్వర్యరాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







