యశ్చోప్రా 4వ జాతీయ అవార్డు కైవసం చేసుకున్న షారుక్
- December 30, 2016
యశ్చోప్రా 4వ జాతీయ అవార్డును బాలీవుడ్ బాద్షా షారుక్ఖానకు ఇవ్వనున్నట్లు టి.ఎస్.ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు టి.సుబ్బరామిరెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. దివంగత యశచోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మిని కొల్హాపురి, బోనీకపూర్లతో కూడిన కమిటీ ఈ ఏడాది అవార్డ్కుగానూ షారుక్ను ఎంపిక చేసింది. యశ్చోప్రా మరణం తర్వాత ఆయన పేరిట ఈ జాతీయ అవార్డును టి.ఎస్.ఆర్ ఫౌండేషన్ పేరుపై ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అవార్డు గ్రహీతకు రూ.10 లక్షల నగదు, బంగారు పతకం, ప్రశంస పత్రం అందజేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ముంబైలోని ఓ హోటల్లో అవార్డు వేడుకను నిర్వహిస్తున్నట్లు సుబ్మరామిరెడ్డి తెలిపారు. గతంలో గాయని లతా మంగేష్కర్, అమితాబ్ బచ్చన్, రేఖ ఈ అవార్డును అందుకున్నారు. అమితాబ్ బచ్చన్, రేఖ, సల్మాన్ ఖాన్, అమీర్ఖాన్, శ్రీదేవి, రాణీముఖర్జీ, జయప్రద, ఐశ్వర్యరాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









