అఖిలేష్ పై 6 ఏళ్ళు వేటు వేసిన ములాయం సింగ్
- December 30, 2016
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అధికార సమాజ్వాదీ పార్టీలో అగ్నిపర్వతం పేలింది. అధినేత ములాయం సింగ్ యాదవ్..తన కుమారుడు, యూపీ సీఎం అయిన అఖిలేశ్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరించారు. సోదరుడు రాంగోపాల్ యాదవ్పైనా వేటు వేశారు. ఈ ఇద్దరినీ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం శుక్రవారం లక్నో లోని పార్టీ కార్యాలయంలో ప్రకటించారు.
మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ టికెట్ల వ్యవహారం తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని మరింత పెంచింది. సీఎం అఖిలేశ్ సూచించినవారికి కాకూడా తనకు నచ్చిన వారికే టికెట్లు కేటాయిస్తూ ములాయం 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
ఇది జరిగిన గంటల వ్యవధిలోనే తండ్రి నిర్ణయాన్ని ధిక్కరిస్తూ అఖిలేశ్.. 235 మంది పేర్లతో కూడి రెబర్స్ జాబితాను ప్రకటించారు. అఖిలేశ్ తిరుగుబాటు చర్యను తీవ్రంగా పరిగణించిన ములాయం.. శుక్రవారం ఉదయం షోకాజ్ నోటీసులు జారీచేశారు. మరి కొద్ది గంటల్లోనే అఖిలేశ్ సహా రాంగోపాల్ యాదవ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









