ఖైదీ వేదిక మారిందా..?
- January 01, 2017
మెగా అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మెగా సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకుండానే ఆడియోను మార్కెట్ లోకి వదిలేస్తున్నారు. అయితే అభిమానుల కోసం ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.
ఈ వేడుక జనవరి 4న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియో మేసేజ్ ద్వారా స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు మెగా అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందుగా అనుకున్నట్టుగా జనవరి 4న కాకుండా జనవరి 7న నిర్వహించాలని భావిస్తున్నారట. అంతేకాదు వేదిక విషయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. విజయవాడలో కాకుండా గుంటూరులో ఫంక్షన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ విషయంలో మెగా టీం ఎలాంటి ప్రకటన చేయకపోయినా వాయిదా వేయటం కన్ఫామ్ అన్నటాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







