ఖైదీ వేదిక మారిందా..?

- January 01, 2017 , by Maagulf
ఖైదీ  వేదిక మారిందా..?

మెగా అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిరంజీవి రీ ఎంట్రీ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను జనవరి 11న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మెగా సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేకుండానే ఆడియోను మార్కెట్ లోకి వదిలేస్తున్నారు. అయితే అభిమానుల కోసం ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

ఈ వేడుక జనవరి 4న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వీడియో మేసేజ్ ద్వారా స్వయంగా ప్రకటించాడు. అయితే ఇప్పుడు మెగా అభిమానులకు షాక్ ఇచ్చే న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందుగా అనుకున్నట్టుగా జనవరి 4న కాకుండా జనవరి 7న నిర్వహించాలని భావిస్తున్నారట. అంతేకాదు వేదిక విషయంలో కూడా మార్పులు జరిగే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. విజయవాడలో కాకుండా గుంటూరులో ఫంక్షన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ విషయంలో మెగా టీం ఎలాంటి ప్రకటన చేయకపోయినా వాయిదా వేయటం కన్ఫామ్ అన్నటాక్ వినిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com