ఇండోనేషియాలో ఘోర ప్రమాదం..

- January 01, 2017 , by Maagulf
ఇండోనేషియాలో ఘోర ప్రమాదం..

ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి తేలుతున్న వేళ ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. జకార్తా సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ ఒక్కసారిగా మునిగిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 23 మంది మృతి చెందగా మరో 17 మంది జాడ గల్లంతైంది. జకార్తా నుంచి 200 మందితో పర్యాటక ప్రదేశమైన టైడంగ్ ఐలండ్‌కు వెళ్తున్న పడవ మార్గమధ్యంలో మునిగిపోయినట్టు అధికారులు తెలిపారు. పడవలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడం వల్లే ఈ ఘటన జరిగినట్టు జాతీయ విపత్తు నివారణ సంస్థ అధికార ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో తెలిపారు. గల్లంతైన ప్రయాణికుల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com