ఒక పదేళ్లపాప మానవబాంబుగా దాడి..

- January 01, 2017 , by Maagulf
ఒక పదేళ్లపాప మానవబాంబుగా దాడి..

దక్షిణ బాగ్దాద్‌లో ఇద్దరు సూసైడ్‌ బాంబర్లు తమనుతాము పేల్చేసుకోవడంతో 9 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఇక, నైజీరియాలోని మైదుగురి నగరంలో.. ఒక పదేళ్లపాప మానవబాంబుగా మారడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల మూడ్‌లో ఉండగా.. రాత్రి 9.30 సమయంలో నూడుల్స్‌ కొనుగోలు చేస్తున్న గుంపు వద్దకు వెళ్లిన ఆ పాప తనను తాను పేల్చేసుకుంది. ఇది బోకోహరాం ఉగ్రవాద సంస్థ పనిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా.. పాపతోపాటు మానవ బాంబుగా వచ్చిన మరో మహిళను స్థానికులు ముందే గమనించి పట్టుకుని దేహశుద్ధి చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com