జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- December 28, 2025
రియాద్: జీసీసీ రైల్వే ప్రాజెక్టులలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి అధ్యయనం కోసం కువైట్ అగ్నిమాపక దళం(కెఎఫ్ఎఫ్) ప్రతినిధి బృందం గత వారం సౌదీ అరేబియాను సందర్శించింది. ఈ బృందానికి కువైట్ అగ్నిమాపక దళం సివిల్ ప్రొటెక్షన్ యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ బ్రిగేడియర్ ఒమర్ హమద్ నాయకత్వం వహించారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రతినిధి బృందం సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులతో సమావేశమయ్యారు.
వీరిలో సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ హమౌద్ బిన్ సులేమాన్ అల్-ఫరాజ్ మరియు సేఫ్టీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అజాబ్ అల్-హర్బీ ఉన్నారు. సౌదీ అరేబియా మెట్రో మరియు రైల్వే నెట్వర్క్లోని తాజా ఫైర్ నివారణ మరియు భద్రతా పద్ధతుల నుండి నేర్చుకోవడం మా సందర్శన ఉద్దేశ్యం అని కువైట్ ప్రతినిధి బృందం తెలిపింది.
కువైట్ ప్రతినిధి బృందం అనేక మెట్రో స్టేషన్లు మరియు సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్)లలో పర్యటించింది. అత్యాధునిక అగ్నిమాపక నివారణ టెక్నాలజీ, అత్యవసర రెస్పాన్స్ విధానాలు మరియు క్విక్ భద్రతా ప్రోటోకాల్లను సమీక్షించడానికి వారు ప్రాజెక్ట్ మేనేజర్లు మరియు టెక్నాలజీ బృందాలతో సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!
- తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు
- అన్ని రకాల డ్రోన్ల పై యూఏఈ నిషేధం..!!









