జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- December 28, 2025
రియాద్: జీసీసీ రైల్వే ప్రాజెక్టులలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి అధ్యయనం కోసం కువైట్ అగ్నిమాపక దళం(కెఎఫ్ఎఫ్) ప్రతినిధి బృందం గత వారం సౌదీ అరేబియాను సందర్శించింది. ఈ బృందానికి కువైట్ అగ్నిమాపక దళం సివిల్ ప్రొటెక్షన్ యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ బ్రిగేడియర్ ఒమర్ హమద్ నాయకత్వం వహించారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రతినిధి బృందం సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులతో సమావేశమయ్యారు.
వీరిలో సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ హమౌద్ బిన్ సులేమాన్ అల్-ఫరాజ్ మరియు సేఫ్టీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అజాబ్ అల్-హర్బీ ఉన్నారు. సౌదీ అరేబియా మెట్రో మరియు రైల్వే నెట్వర్క్లోని తాజా ఫైర్ నివారణ మరియు భద్రతా పద్ధతుల నుండి నేర్చుకోవడం మా సందర్శన ఉద్దేశ్యం అని కువైట్ ప్రతినిధి బృందం తెలిపింది.
కువైట్ ప్రతినిధి బృందం అనేక మెట్రో స్టేషన్లు మరియు సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్)లలో పర్యటించింది. అత్యాధునిక అగ్నిమాపక నివారణ టెక్నాలజీ, అత్యవసర రెస్పాన్స్ విధానాలు మరియు క్విక్ భద్రతా ప్రోటోకాల్లను సమీక్షించడానికి వారు ప్రాజెక్ట్ మేనేజర్లు మరియు టెక్నాలజీ బృందాలతో సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









