జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- December 28, 2025
రియాద్: జీసీసీ రైల్వే ప్రాజెక్టులలో ఫైర్ సేఫ్టీకి సంబంధించి అధ్యయనం కోసం కువైట్ అగ్నిమాపక దళం(కెఎఫ్ఎఫ్) ప్రతినిధి బృందం గత వారం సౌదీ అరేబియాను సందర్శించింది. ఈ బృందానికి కువైట్ అగ్నిమాపక దళం సివిల్ ప్రొటెక్షన్ యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ బ్రిగేడియర్ ఒమర్ హమద్ నాయకత్వం వహించారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రతినిధి బృందం సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులతో సమావేశమయ్యారు.
వీరిలో సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డాక్టర్ హమౌద్ బిన్ సులేమాన్ అల్-ఫరాజ్ మరియు సేఫ్టీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ అజాబ్ అల్-హర్బీ ఉన్నారు. సౌదీ అరేబియా మెట్రో మరియు రైల్వే నెట్వర్క్లోని తాజా ఫైర్ నివారణ మరియు భద్రతా పద్ధతుల నుండి నేర్చుకోవడం మా సందర్శన ఉద్దేశ్యం అని కువైట్ ప్రతినిధి బృందం తెలిపింది.
కువైట్ ప్రతినిధి బృందం అనేక మెట్రో స్టేషన్లు మరియు సౌదీ రైల్వే కంపెనీ (ఎస్ఎఆర్)లలో పర్యటించింది. అత్యాధునిక అగ్నిమాపక నివారణ టెక్నాలజీ, అత్యవసర రెస్పాన్స్ విధానాలు మరియు క్విక్ భద్రతా ప్రోటోకాల్లను సమీక్షించడానికి వారు ప్రాజెక్ట్ మేనేజర్లు మరియు టెక్నాలజీ బృందాలతో సమావేశమయ్యారు. రైల్వే ప్రాజెక్టును 2030 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







