భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- December 28, 2025
సౌదీ అరేబియా: భారతీయులను అత్యధికంగా వెనక్కి పంపే దేశం అమెరికా అని కాదు. వాస్తవ గణాంకాల ప్రకారం, గత ఐదేళ్లలో అత్యధిక బహిష్కరణలు సౌదీ అరేబియా నుంచి జరిగాయి.ఈ వివరాలను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పార్లమెంటులో వెల్లడించింది.
025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల నుంచి 24,600 మందికి పైగా భారతీయులు బహిష్కరణకు గురయ్యారు. వీరిలో సౌదీ అరేబియా నుండి 11,000 మందికి పైగా భారతీయులు తిరస్కరణకు గురైనట్టు సమాచారం. ఇదే సమయంలో అమెరికా నుంచి సుమారు 3,800 మంది భారతీయులను వెనక్కి పంపారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ డిసెంబర్ 18న రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు.
సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాల్లో వీసా గడువు ముగిసిన తర్వాత అక్కడే ఉండటం, సరైన పర్మిట్లు లేకుండా పనిచేయడం, స్థానిక కార్మిక నిబంధనలను ఉల్లంఘించడం, ఇతర సివిల్ లేదా క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం వంటి కారణాల వల్ల భారతీయులు బహిష్కరణకు గురవుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారి బహుళ సంఖ్య తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులే కావడం, ఏజెంట్ల ద్వారా వెళ్లి కొన్నిసార్లు చిన్న తప్పులు చేయడం వల్ల కూడా బహిష్కరణలు ఎదురవుతున్నాయి.
అమెరికాలో పరిస్థితి వేరుగా ఉంది. అక్కడ వీసా స్టేటస్, వర్క్ పర్మిట్, ఇతర పత్రాలను కఠినంగా తనిఖీ చేస్తున్నారు. వీసా గడువు ముగిసిన వారు, అనుమతి లేకుండా పనిచేసినవారు, నిబంధనలు ఉల్లంఘించినవారిని గుర్తించి వెనక్కి పంపుతున్నారు. 2025లో అమెరికా నుంచి బహిష్కరణలు గత ఐదేళ్లలో అత్యధికంగా నమోదయినట్టు గమనార్హం.
2025లో సౌదీ, అమెరికా తర్వాత భారతీయులను ఎక్కువగా బహిష్కరించిన దేశాల్లో మలేషియా (1,485), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (1,469), మయన్మార్ (1,591) ఉన్నాయి. విద్యార్థుల బహిష్కరణలో యునైటెడ్ కింగ్డమ్ (170) అత్యధికంగా ఉంది. ఆస్ట్రేలియా (114), రష్యా (82), అమెరికా (45) తదితర దేశాలు తర్వాత ఉన్నాయి.
భారత ప్రభుత్వం చట్టవిరుద్ధ వలసలను నిరుత్సాహపరచడం, చట్టబద్ధమైన ప్రయాణాలను ప్రోత్సహించడం లక్ష్యంగా ఉందని స్పష్టం చేసింది. బహిష్కరణకు గురైన వారి జాతీయతను నిర్ధారించడం, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు జారీ చేయడంలో విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు సహాయం అందిస్తున్నాయని MEA తెలిపింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







