ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- December 28, 2025
అమెరికా: అమెరికాలోని ఈశాన్య ప్రాంతాలు, గ్రేట్ లేక్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మంచు వర్షం శనివారం నాటికి మరింత ఉధృతమై సాధారణ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. సెలవుల సీజన్ కావడంతో ప్రయాణాల్లో ఉన్న వేలాది మంది ఈ వాతావరణ ప్రతికూలతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
భారీ మంచు కురుపు, బలమైన గాలుల కారణంగా విమాన సర్వీసులు గందరగోళానికి గురయ్యాయి. శనివారం మధ్యాహ్నానికి అమెరికా వ్యాప్తంగా సుమారు 5,580 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు, కనీసం 860 విమానాలు పూర్తిగా రద్దైనట్లు సమాచారం. న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాలపై ఈ తుపాను ప్రభావం ఎక్కువగా పడింది. జాన్ ఎఫ్. కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు సగటున రెండు గంటల ఆలస్యంతో కొనసాగుతున్నాయి.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల గవర్నర్లు ‘స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండాలని, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఆదివారం దాదాపు 2.86 మిలియన్ల మంది విమాన ప్రయాణాలు చేయనున్నారన్న అంచనాల మధ్య ఈ మంచు తుపాను ఆందోళన కలిగిస్తోంది.
మంచు ప్రభావం రవాణాతో పాటు విద్యుత్ సరఫరాపై కూడా పడింది. మిచిగాన్ రాష్ట్రంలో భారీగా మంచు కురవడంతో విద్యుత్ లైన్లు తెగిపడి, శనివారం ఉదయానికే సుమారు 30 వేల ఇళ్లు, వాణిజ్య ప్రాంతాలకు విద్యుత్ నిలిచిపోయింది. న్యూయార్క్ నుంచి ఫిలడెల్ఫియా వరకు పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!
- సోమాలిలాండ్ గుర్తింపును తిరస్కరించిన కువైట్..!!
- యూఏఈ-భారత్ మధ్య విమాన ఛార్జీలు తగ్గుతాయా?
- సౌదీ అరేబియాలో 13,241 మందిపై బహిష్కరణ వేటు..!!
- లుసైల్ బౌలేవార్డ్ ‘అల్-మజ్లిస్’ డిసెంబర్ 31 టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్లో 17.3 శాతం పెరిగిన రియల్ ఇండెక్స్..!!
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు







