ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో సైన్స్ మ్యూజియం..
- January 03, 2017
ఆధ్మాత్మిక నగరం తిరుపతిలో అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శణశాల(సైన్స్ మ్యూజియం)కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు ఉదయం శంకుస్థాపన చేశారు. 'బ్రహ్మాండ'గా నామకరణం చేసిన ఈ మ్యూజియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుపతిలోని అలిపిరి వద్ద 200 ఎకరాల్లో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. డీఆర్డీఓ ఆధ్వర్యంలో దీని నిర్మాణానికి ప్రత్యేక ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి,. రక్షణశాఖ సలహాదారు సతీష్రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే అంతర్జాతీయ మ్యూజియం నమూనా సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించిన నమూనాను మంగళవారం సాయంత్రం డీఆర్డీఓ ప్రదర్శనశాల వద్ద ఏర్పాటుచేశారు.
మ్యూజియానికి సంబంధించిన ప్రతిపాదనలు, నమూనాను సైన్స్ కాంగ్రెస్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయమంత్రి సుజనాచౌదరి, రక్షణశాఖ సలహాదరు సతీష్రెడ్డి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







