దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కారు షాక్..
- January 03, 2017
భారత మోస్ట్ వాంటెడ్ నేరగాడు.. మాఫియా డాన్, ముంబైలో వరుసపేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సర్కారు గట్టి షాకిచ్చింది. యూఏఈలో ఉన్న ఆస్తులను అక్కడి ప్రభుత్వం జప్తుచేసింది. ఈ జప్తు చేసిన ఆస్తుల విలువ రూ.15 వేల కోట్ల దాకా ఉంటుందని అంచనా.
దావూద్కు యూఏఈలో పలు హోటళ్లు, ప్రముఖ కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. ఈ మేరకు భారత ప్రభుత్వం నుంచి అందుకున్న అత్యంత గోప్యమైన జాబితా ఆధారంగా యూఏఈ సర్కారు దావూద్ ఇబ్రహీం ఆస్తులపై విచారణ ప్రారంభించి, చర్యలు తీసుకుంది.
ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్ గత ఏడాది యూఏఈ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ జాబితా సమర్పించి..
డి కంపెనీ ఆస్తులు స్వాధీనం చేసుకోవాల్సిందిగా కోరినట్టు సమాచారం. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ సర్కారు దావూద్ ఆస్తులను జప్తు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో.. దుబాయ్లో దావూద్ సోదరుడు అనీస్ ఇబ్రహీం 'గోల్డెన్ బాక్స్' పేరుతో నడుపుతున్న ఒక కంపెనీ గురించి కూడా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







