పొగమంచు ప్రమాదాల్లో ఒకరి మృతి 29 మందికి గాయాలు..
- January 04, 2017
డిసెంబర్లో పొగమంచు కారణంగా ఒకరు మృతి చెందగా 29 మంది గాయాల పాలైనట్లు ట్రాఫిక్ గణాంకాలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వివరాల ప్రకారం మొత్తం 17 మేజర్ యాక్సిడెంట్లు డిసెంబర్లో జరిగాయి. మినిస్ట్రీకి చెందిన ట్రాఫిక్ కో-ఆర్డినేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఘాయిత్ అల్ జాబి మాట్లాడుతూ, హైవేలు మరియు, అంతర్గత రహదార్లపై దట్టమైన పొగమంచు కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. తమ శాఖ, ఇతర ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందనీ, సేఫ్టీ మెజర్స్ విషయంలో రాజీ పడటంలేదనీ అలాగే వాహనదారుల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. అధిక వేగం, టైల్గేటింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు వివరించారాయన. హెవీ వెహికిల్స్కి చెందిన కంపెనీలకు ట్రాఫిక్ సమస్యలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!









