భారతరత్నజయలలితకు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ......

- January 06, 2017 , by Maagulf
భారతరత్నజయలలితకు ఇవ్వాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ ......

తమిళనాడు మాజీ సీఎం జయలలితకు భారతరత్న ప్రకటించేలా కేంద్రాన్ని సూచిన ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో కేంద్రానికి తాము ఎలాంటి సూచనలు ఇవ్వబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. అమ్మకు భారత రత్న ఇవ్వాలని, పోస్టల్ స్టాంపులు విడుదల చేయాలంటూ తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు కోరారు. అలాగే పలు దఫాలుగా లేఖలు సైతం రాశారు. పార్లమెంటులో జయలలిత విగ్రహం ఏర్పాటు చేయాలనీ కోరారు. అయితే ఈ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాన్ని వెలువరించలేదు. దీనిపై తాజాగా మద్రాస్ హైకోర్టు కూడా వివరణ ఇవ్వడంతో మున్ముందు ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com