సిరియాలో కారు బాంబు పేలుడు, 14మంది మృతి
- January 07, 2017
సిరియాలోని అజాజ్లో జలహాబ్ అనే సెంటర్లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14మంది మృత్యువాతపడ్డారు. భారీ సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని స్థానికులు ధ్రువీకరించారు. ఈ పట్టణం టర్కీ సరిహద్దు సమీపంలో ఉంది. సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ లెక్కల ప్రకారం ఈ దాడిలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే సెంటర్లోని కోర్టు ప్రాంగణం ఎదురుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను అలెప్పోలోని మెడికల్ క్యాంప్కు తరలించారు. ఈ ప్రాంతంపై ఇటీవలే ఐసిస్ పట్టుపెంచుకుంటోంది. రష్యా మధ్య వర్తిత్వంతో జరిగిన సంధికి గండి కొట్టేందుకు ఈ పేలుడు జరిపినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!
- ఖతార్ లో 31 ఆహార సంస్థలు సీజ్..!!
- మా యాత్రికులు సౌదీ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నారు: ఇరాన్









