సిరియాలో కారు బాంబు పేలుడు, 14మంది మృతి
- January 07, 2017
సిరియాలోని అజాజ్లో జలహాబ్ అనే సెంటర్లో కారు బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 14మంది మృత్యువాతపడ్డారు. భారీ సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. ఈ విషయాన్ని స్థానికులు ధ్రువీకరించారు. ఈ పట్టణం టర్కీ సరిహద్దు సమీపంలో ఉంది. సిరియాలోని ఓ మానవ హక్కుల సంస్థ లెక్కల ప్రకారం ఈ దాడిలో 19మంది ప్రాణాలు కోల్పోయారు. రద్దీగా ఉండే సెంటర్లోని కోర్టు ప్రాంగణం ఎదురుగా ఈ సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను అలెప్పోలోని మెడికల్ క్యాంప్కు తరలించారు. ఈ ప్రాంతంపై ఇటీవలే ఐసిస్ పట్టుపెంచుకుంటోంది. రష్యా మధ్య వర్తిత్వంతో జరిగిన సంధికి గండి కొట్టేందుకు ఈ పేలుడు జరిపినట్లు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







