తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి...

- January 07, 2017 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి...

హైదరాబాద్ : ముక్కోటి ఏకాదశి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఆదివారం తెల్లవారుజామునుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలోని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అలాగే ధర్మపురి నృసింహస్వామి ఆలయం, పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. కాగా... చిన వెంకన్నను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ దర్శించుకున్నారు. అలాగే నరసాపురం దగ్గర గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. అలాగే ఏలూరు ఆర్‌ఆర్‌పేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పెద్దఎత్తున పూజలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com