ప్రవాసి యోగక్షేమ
- January 08, 2017కేంద్ర కార్మిక సంఘాలలో ఒకటైన 'ట్రేడ్ యూనియన్ కో ఆర్డినేషన్ సెంటర్' (టియుసిసి) జాతీయ అధ్యక్షులు, తెలంగాణ కు చెందిన పి.నారాయణ స్వామి నాయకత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బెంగళూరు లో 7 నుండి 9 జనవరి వరకు జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్-2017 ఉత్సవాలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎన్నారైలు, ప్రవాసి కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల గురించి విజ్ఞప్తి చేశారు
* వలస కార్మికుల కోసం సమగ్ర సామాజిక భద్రత (జీవిత బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్, వాపస్ వచ్చినాక పునరావాసం)
* ఎమిగ్రేషన్ చట్టం-1983 ను సమీక్షించి, దాన్ని మరింత బలోపేతం చేయడానికి సమగ్రమైన ఎమిగ్రేషన్ మేనేజ్మెంట్ చట్టం చేయాలి
* విదేశాలలోని భారత రాయబార కార్యాలయాల సామర్థ్యాలని బలోపేతం చేసి విస్తరించాలి. విదేశాలలోని భారత వలసదారులను నమోదు చేయడం, హక్కుల పరిరక్షణకు, సమస్యల పరిష్కారానికి భారత రాయబార కార్యాలయాలు కృషి చేయాలి
* విదేశాలకు వెళ్లేముందు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తగిన శిక్షణ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టబద్దం చేయాలి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహించాలి
* విమానాశ్రయాల్లో రాకపోకలు సాగించే టర్మినల్స్ లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలి
* ఉద్యోగాల నియామక ప్రక్రియలో అనుసరించే ప్రామాణిక విధానాలు పాటించి వలస కార్మికుల రిక్రూటింగ్ వ్యవస్థను అజమాయిషీ చేయాలి
* రాష్ట్రాలలో ప్రవాస భారతీయుల కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, పరిపాలన శాఖలను ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు భారత ప్రభుత్వం సలహా ఆదేశం ఇవ్వాలి
* సమర్థవంతమైన పాలన కొరకు మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం కొరకు కమిటీలను ఏర్పాటు చేయాలి
* వలస కార్మికుల హక్కుల రక్షణ కొరకు ద్వైపాక్షిక ఒప్పందాలు, అవగాహన ఒప్పందాలు సమర్థవంతంగా అమలు చేయుటకు భారత ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలతో తగిన ఏర్పాట్లు చేయాలి
* ప్రవాస భారతీయులకు ఆన్ లైన్ ఓటింగ్ సౌకర్యం కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలి
* వలసలు మరియు అభివృద్ధి అనే విషయంపై సార్క్, కొలంబో ప్రాసెస్, అబుదాబి డైలాగ్, జిఎఫ్ఎండి లాంటి అంతర్జాతీయ వేదికలపై వేదికలపై భారత ప్రభుత్వం చురుకుగా పాలుపంచుకోవాలి
* వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల పరిరక్షణ గురించి ఐక్యరాజ్య సమితిలో 26 ఏళ్ల క్రితం 1990 లో చేసిన తీర్మానాన్ని భారత ప్రభుత్వం ఆమోదించాలి. ఇంటి పనివారలకు గౌరవప్రదమైన పని అనే నినాదంతో ఐక్యరాజ్య సమితిలో చేసిన సి-189 తీర్మానాన్ని కూడా భారత ప్రభుత్వం ఆమోదించాలి.
--మంద భీం రెడ్డి
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల