ముంబయిలో అతిపెద్ద పబ్లిక్‌ వైఫై సర్వీసు...

- January 09, 2017 , by Maagulf
ముంబయిలో అతిపెద్ద పబ్లిక్‌ వైఫై సర్వీసు...

ముంబయి: ప్రజలకు ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 500 వైఫై హాట్‌స్పాట్‌లను ప్రకటించింది. మే 1 నాటికి ఆ సంఖ్య 1200కి చేరేలా ప్రయత్నిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. ముంబయి వైఫై సర్వీసు భారత్‌లోనే అతిపెద్ద పబ్లిక్‌వైఫై సర్వీస్‌గా ఉందని, ప్రపంచంలో ఒకటిగా నిలిచిందని సీఎం ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. వైఫై సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాటి పనితీరు, వేగంగా ఉందా లేదా అనే దానిపై నిరంతరం పర్యవేక్షిస్తుంటామని ఆయన తెలిపారు. ప్రయోగాత్మక దశలో భాగంగా జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు నగరం మొత్తం మీద 23వేల మంది యూజర్లు 2టీబీ పైన డేటాను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com