ఆగస్టులో ధ్రువ నక్షత్రం....
- January 09, 2017
చెన్నై: కొంతకాలంగా గౌతం మేనన్ 'ధ్రువ నక్షత్రం' నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. తొలుత సూర్యతో తెరకెక్కించాలని భావించారు. ఆ తర్వాత పలువురు హీరోలను దాటుకుని విక్రం చేతికొచ్చింది. నిజానికి 'ఇరుముగన్' సినిమా తర్వాత విజయ్చందర్ దర్శకత్వంలోని ఓ సినిమా, ఆ తర్వాత హరి దర్శకత్వంలోని 'సామి 2'లో విక్రం నటిస్తారని వార్తలొచ్చాయి. అయితే 'సామి 2' కన్నా ముందుగానే 'ధ్రువ నక్షత్రం' చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారు విక్రం. ఈ సినిమా కమల్ నటించిన 'వేట్టైయాడు విళయాడు' తరహాలో ఉంటుందని సమాచారం. చిత్రీకరణ పూర్తిగా విదేశాల్లోనే జరగనుంది.
ఇందులో విక్రం.. జాన్ అనే గూఢచారి పాత్రలో నటించనున్నారు. రానున్న ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కన్నా ముందుగా విజయ్చందర్ దర్శకత్వంలోని చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









