బహ్రైన్ లో భారతీయ కార్మికులపై దౌర్జన్యం - విచారణ చేస్తున్న అధికారులు
- September 11, 2015
బహ్రైన్, సలామాబాద్ లోని ఒక పారిశుధ్య సేవల సంస్థలో పనిచేస్తున్న థామస్ దేవాసియా 32, జితేష్ ఆరాత్తాoకడీ 30, ప్రవీణ్ నారాయణన్ 30 మరియు ఆషేరాఫ్ కున్నోత్ మీథాల్ 41 అనే నలుగురు భారతీయులు, తమ యజమాని తమ పాస్పోర్టులను స్వాధీనం చేసుకొని, తమను కొడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని, వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదని భారతీయ దౌత్య కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, అధికారులు విచారణ చేస్తున్నారు.
ఎంతో ప్రాధేయపడిన మీదట తమ భార్యా, పిల్లల పాస్ పోర్టులను మాత్రం తిరిగి ఇచ్చారని, బతుకు జీవుడా అని స్వదేశానికి వారిని పంపించానని దేవాసియా అనే అతను చెప్పాడు. . అమిత ఉష్ణోగ్రతల వలన కార్మికులు జబ్బులపాలైన పట్టించుకోరని, కండిష న్ లో లేనివి, ఏ. సి. లేని వాహనాలను నడపమని నిర్బంధిస్తారని, తమను నిద్రకూడా పోనీయట్లేదని, నారాయణన్ అనే వ్యక్తి తన పాస్ పోర్టును తిరిగివ్వమని అడిగిన మీదట తీవ్రంగా గాయపరచిన మీదట పరిస్థితి పీకలదాక వచ్చిందని, అందుకే ఫిర్యాదు చేశామని, ఐతే తాను బహ్రైనీయుడైనందువల్ల తనను ఎవరు ఏమీ చేయరని అతను అన్నాడనీ వాపోయారు. ఈ విషయంపై వివరణ ఈయడానికి సదరు కంపెనీ నుండి ఎవరు నోరు మెదపకపొవడo కొసమెరుపు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







