బహ్రైన్ లో భారతీయ కార్మికులపై దౌర్జన్యం - విచారణ చేస్తున్న అధికారులు

- September 11, 2015 , by Maagulf
బహ్రైన్ లో భారతీయ కార్మికులపై దౌర్జన్యం - విచారణ చేస్తున్న అధికారులు

బహ్రైన్, సలామాబాద్ లోని ఒక పారిశుధ్య సేవల సంస్థలో పనిచేస్తున్న థామస్ దేవాసియా 32, జితేష్ ఆరాత్తాoకడీ 30, ప్రవీణ్ నారాయణన్ 30 మరియు ఆషేరాఫ్ కున్నోత్ మీథాల్ 41 అనే నలుగురు భారతీయులు, తమ యజమాని తమ పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకొని, తమను కొడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని, వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదని భారతీయ దౌత్య కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, అధికారులు విచారణ చేస్తున్నారు.

ఎంతో ప్రాధేయపడిన మీదట తమ భార్యా, పిల్లల పాస్ పోర్టులను మాత్రం తిరిగి ఇచ్చారని, బతుకు జీవుడా అని స్వదేశానికి వారిని పంపించానని దేవాసియా అనే అతను చెప్పాడు. . అమిత ఉష్ణోగ్రతల వలన కార్మికులు జబ్బులపాలైన పట్టించుకోరని, కండిష న్ లో లేనివి, ఏ. సి. లేని వాహనాలను నడపమని నిర్బంధిస్తారని, తమను నిద్రకూడా పోనీయట్లేదని, నారాయణన్ అనే వ్యక్తి తన పాస్ పోర్టును తిరిగివ్వమని అడిగిన మీదట తీవ్రంగా గాయపరచిన మీదట పరిస్థితి పీకలదాక వచ్చిందని, అందుకే ఫిర్యాదు చేశామని, ఐతే తాను బహ్రైనీయుడైనందువల్ల తనను ఎవరు ఏమీ చేయరని అతను అన్నాడనీ వాపోయారు. ఈ విషయంపై వివరణ ఈయడానికి సదరు కంపెనీ నుండి ఎవరు నోరు మెదపకపొవడo కొసమెరుపు.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com