బహ్రైన్ లో భారతీయ కార్మికులపై దౌర్జన్యం - విచారణ చేస్తున్న అధికారులు
- September 11, 2015
బహ్రైన్, సలామాబాద్ లోని ఒక పారిశుధ్య సేవల సంస్థలో పనిచేస్తున్న థామస్ దేవాసియా 32, జితేష్ ఆరాత్తాoకడీ 30, ప్రవీణ్ నారాయణన్ 30 మరియు ఆషేరాఫ్ కున్నోత్ మీథాల్ 41 అనే నలుగురు భారతీయులు, తమ యజమాని తమ పాస్పోర్టులను స్వాధీనం చేసుకొని, తమను కొడుతున్నారని, దుర్భాషలాడుతున్నారని, వేతనాలు కూడా సరిగా చెల్లించడం లేదని భారతీయ దౌత్య కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో, అధికారులు విచారణ చేస్తున్నారు.
ఎంతో ప్రాధేయపడిన మీదట తమ భార్యా, పిల్లల పాస్ పోర్టులను మాత్రం తిరిగి ఇచ్చారని, బతుకు జీవుడా అని స్వదేశానికి వారిని పంపించానని దేవాసియా అనే అతను చెప్పాడు. . అమిత ఉష్ణోగ్రతల వలన కార్మికులు జబ్బులపాలైన పట్టించుకోరని, కండిష న్ లో లేనివి, ఏ. సి. లేని వాహనాలను నడపమని నిర్బంధిస్తారని, తమను నిద్రకూడా పోనీయట్లేదని, నారాయణన్ అనే వ్యక్తి తన పాస్ పోర్టును తిరిగివ్వమని అడిగిన మీదట తీవ్రంగా గాయపరచిన మీదట పరిస్థితి పీకలదాక వచ్చిందని, అందుకే ఫిర్యాదు చేశామని, ఐతే తాను బహ్రైనీయుడైనందువల్ల తనను ఎవరు ఏమీ చేయరని అతను అన్నాడనీ వాపోయారు. ఈ విషయంపై వివరణ ఈయడానికి సదరు కంపెనీ నుండి ఎవరు నోరు మెదపకపొవడo కొసమెరుపు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







