భారీగా పెరిగిన బంగారం ధర

- January 10, 2017 , by Maagulf
భారీగా పెరిగిన బంగారం ధర

పసిడి ధర మళ్లీ పరుగులు పెట్టింది. నోట్ల రద్దు తర్వాత కొంతకాలం పాటు నేల చూపులు చూసిన బంగారం ధరం ఆ తర్వాత క్రమంగా పుంజుకుంది. ఈరోజు ఏకంగా పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.330 పెరిగి రూ.29,030కి చేరుకుంది. ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వల్లే పసిడి ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది డిసెంబరు 5న రూ.29,050 ఉన్న బంగారం ధర నెల రోజుల మళ్లీ ఆ స్థాయికి చేరుకుంది. వెండి ధర కూడా కిలోకు రూ.350 పెరిగి రూ.40,750కు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com