తెలంగాణా లో 'రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదు'

- September 11, 2015 , by Maagulf
తెలంగాణా లో 'రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదు'

 తెలంగాణా రాష్ట్రంలో పంటల పరిస్థితిపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ సచివాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంటల పరిస్థితిపై చర్చించారు. ఏడీఏలు, ఏవోలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. రూ.లక్షలోపు పంట రుణాలకు వడ్డీ వర్తించదని తెలిపారు. రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు ఉన్న రుణాలకు పావలా వడ్డీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని సీడ్ ఫార్మ్‌లలో విత్తనోత్పత్తి అయ్యే విధంగా చేయాలని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com