సంచలనం సృష్టించిన పేస్‌ జోడీ

- January 11, 2017 , by Maagulf
సంచలనం సృష్టించిన పేస్‌ జోడీ

ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఏఎస్‌బీ క్లాసిక్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి టెన్నిస్‌ క్రీడాకారుడు లియాండర్‌ పేస్‌, ఆండ్రి సా జోడీ సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఈ ద్వయం 7-6(3), 6-3తో టాప్‌సీడ్‌ ట్రీట్‌ హ్యూ, మాక్స్‌ మిర్నీ జోడీకి షాకిచ్చింది. తర్వాతి రౌండ్లో వైల్డ్‌కార్డ్‌ ద్వారా ప్రవేశం పొందిన మార్కస్‌ డేనియెల్‌, మార్సిలో డిలోలినర్‌తో పేస్‌జోడీ తలపడనుంది.
సెమీస్‌కు సానియా
డబ్ల్యూటీఏ అపియా ఇంటర్నేషనల్‌ టోర్నీలో టాప్‌సీడ్స్‌ సానియా మీర్జా, బార్బారా స్ట్రైకోవా జోడీ సెమీస్‌ చేరింది. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో మాడిసన్‌ బ్రెంగిల్‌, ఎరినా రోడినోవా ద్వయాన్ని 6-3, 6-4తో చిత్తు చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com