పెరిగిన బంగారం, వెండి ధరలు

- January 11, 2017 , by Maagulf
పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.70లు పెరిగి 29,100కు చేరింది. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా వివాహ వేడుకల నేపథ్యంలో బంగారం వర్తకుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి. పరిశ్రమలు, నాణేల తయారీదారుల డిమాండ్‌ కారణంగా కేజీ వెండి ధర రూ.550 పెరిగి 41,330కు చేరింది. ప్రపంచ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.29 శాతం పెరిగి 1190.70 డాలర్లకు చేరుకుంది. వెండి ధర 0.39 శాతం పెరిగి 16.82 డాలర్లకు చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com