ఐడియా,ఎయిర్టెల్, వొడాఫోన్ కు భారీ జరిమానా
- January 12, 2017
సేవా నిబంధనల విషయంలో నాణ్యతను విస్మరించినందుకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లకు సంచిత శిక్ష చర్య కింద ట్రాయ్ విధించిన రూ.3,050 కోట్ల జరిమానా చెల్లింపుల విషయంలో అడ్డంకులు తొలగిపోయాయి. జరిమానాలు విధించే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం(డీవోటీ)కి ఉందని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు ఆయా కంపెనీలు జరిమానా నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రూల్స్ను అతిక్రమించిన ఎయిర్టెల్, వొడాఫోన్లకు ఒక్కోదాని నుంచి రూ.1,050 కోట్ల చొప్పున జరిమానా వసూలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ట్రాయ్ ప్రతిపాదనలు పంపింది. అలాగే ఐడియాకు రూ.950 కోట్ల జరిమానా విధించింది.
ఈ మూడు కంపెనీలు నిబంధనలు అతిక్రమించడంతోపాటు రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్ట్ పాయింట్ల విషయంలో వీటిపై ఆరోపణలు ఉన్నాయి. ట్రాయ్ జరిమానాల ప్రతిపాదన నేపథ్యంలో టెలికం డిపార్ట్మెంట్ అటార్నీ జనరల్ అభిప్రాయం కోరింది. ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఇవ్వకపోవడంతో తమ నెట్వర్క్ నుంచి వెళ్తున్న 75 శాతం కాల్స్ డ్రాప్ అవుతున్నాయంటూ రిలయన్స్ జియో ట్రాయ్ను ఆశ్రయించడంతో ఈ కేసు మొదలైంది.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!









