ఐడియా,ఎయిర్టెల్, వొడాఫోన్ కు భారీ జరిమానా
- January 12, 2017
సేవా నిబంధనల విషయంలో నాణ్యతను విస్మరించినందుకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లకు సంచిత శిక్ష చర్య కింద ట్రాయ్ విధించిన రూ.3,050 కోట్ల జరిమానా చెల్లింపుల విషయంలో అడ్డంకులు తొలగిపోయాయి. జరిమానాలు విధించే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం(డీవోటీ)కి ఉందని అటార్నీ జనరల్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇప్పుడు ఆయా కంపెనీలు జరిమానా నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. క్వాలిటీ ఆఫ్ సర్వీస్ రూల్స్ను అతిక్రమించిన ఎయిర్టెల్, వొడాఫోన్లకు ఒక్కోదాని నుంచి రూ.1,050 కోట్ల చొప్పున జరిమానా వసూలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి ట్రాయ్ ప్రతిపాదనలు పంపింది. అలాగే ఐడియాకు రూ.950 కోట్ల జరిమానా విధించింది.
ఈ మూడు కంపెనీలు నిబంధనలు అతిక్రమించడంతోపాటు రిలయన్స్ జియోకు ఇంటర్ కనెక్ట్ పాయింట్ల విషయంలో వీటిపై ఆరోపణలు ఉన్నాయి. ట్రాయ్ జరిమానాల ప్రతిపాదన నేపథ్యంలో టెలికం డిపార్ట్మెంట్ అటార్నీ జనరల్ అభిప్రాయం కోరింది. ఇంటర్ కనెక్ట్ పాయింట్లు ఇవ్వకపోవడంతో తమ నెట్వర్క్ నుంచి వెళ్తున్న 75 శాతం కాల్స్ డ్రాప్ అవుతున్నాయంటూ రిలయన్స్ జియో ట్రాయ్ను ఆశ్రయించడంతో ఈ కేసు మొదలైంది.
తాజా వార్తలు
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!







