హజ్‌యాత్ర రాయితీలు పెంచండి: డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

- January 15, 2017 , by Maagulf
హజ్‌యాత్ర రాయితీలు పెంచండి: డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ

హజ్​ యాత్రకు అందించే రాయితీలు పెంచాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందిస్తున్న రూ.690కోట్ల రాయితీలు పేద ముస్లింలకు ఆసరాగా ఉపయోగపడుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. మన దేశం నుంచి పవిత్ర మక్కా యాత్రకు వెళ్లే పేద ముస్లింలకు అందించే ప్రోత్సాహకాలను రూ,.690 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com