యెమన్ లో సంక్షోభ నివారణకే బహ్రైన్ దృఢ నిశ్చయం
- September 12, 2015
యెమన్ లో ప్రభుత్వ పునరుద్ధరణకై సౌదీ నేతృత్వంలో నడుస్తున్న కూటమి
'ఆపరేషన్ రెస్టోరింగ్ హోప్' కు తమ నిరంతర మద్దతు కొనసాగిస్తామని, బహ్రైన్ ప్రకటించింది. హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్, అబుధాబీ యువరాజు మరియు యూ. ఏ. ఈ. సాయుధ దళాల డేప్యూటీ సుప్రీం కమాండర్ తో మొహమ్మెడ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో కలసి, యెమన్ మరీబ్ ప్రావి న్స్ లో గత శుక్రవారం జరిగిన ఆయుధాగారం పై
మిస్సైల్ దాడిలో జరిగిన మరణించిన GCC సైనికుల ప్రత్యేక సంస్మరణ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ లో జరిగింది.
మొత్తం 45 మంది యూ. ఏ. ఈ., 10 మంది సౌదీ మరియు ఐదుగురు బహ్రైన్ సైనికులు ఈ ఘటనలో మరణించిన సంగతి విదితమే; ఈ వీరుల బలిదానం, చరిత్రాత్మిక ఐక్యతకు, సంఘీభావానికీ చిహ్నమని అధినేత వ్యాఖ్యానించారు. అరబ్ ప్రపంచంలో సోదరదేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కోవడానికి భుజాన్నందించే తమ నిబద్ధతను స్పష్టం చేశారు. డేప్యూటీ కింగ్ హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా కూడా కూడా ఆ ఆపరేషన్ కు తమ పూర్తి మద్దతును తెలుపుతూ, అరబ్ మరియు ప్రాంతీయ దేశాల పట్ల సాయుధ దళాల కృషిని శ్లాఘించారు. ఈయన రిఫ్ఫా లోని షేక్ ఈ సా మసీదులో జరిగిన గతించిన వారి అంత్యక్రియలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వఉన్నత అధికారులు, మంత్రులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న మసీదులలో కూడా ఈ విధమైన ప్రార్ధనలు జరిగాయి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







