మాస్ యాక్షన్ ఎంటర్టైనర్...
- January 17, 2017
గోపీచంద్, హన్సిక, కేథరిన్ థ్రెస్సా హీరోహీరోయిన్లుగా, సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'థారులాండ్, హైదరాబాద్లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన చివరి షెడ్యూల్ ఫిబ్రవరి 20 వరకు జరుగుతుంది. ఇందులో గోపీచంద్, హన్సిక, కేథరిన్ థ్రెస్సాలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. రామ్-లక్ష్మణ్ల అధ్వర్యంలో చిత్రీకరించనున్న యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్గా నిలువనున్నాయి.
దర్శకుడు సంపత్నంది పోరాట సన్నివేశాలతోపాటు ఎమోషనల్ సీన్స్ను హ్యాండిల్ చేసే విధానం, ఆ సన్నివేశాల్ని మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ కెమెరాతో బంధించిన తీరు ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. విశేషంగా అలరిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ స్టయిలీష్గా కనిపిస్తారు. సంపత్ నంది మార్క్, పవర్ఫుల్ టైటిల్తోపాటు గోపీచంద్ స్టయిలీష్ లుక్ను త్వరలో విడుదల చేస్తాం.
అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మా బ్యానర్ విలువను పెంచుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈచిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తాం' అని అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!







