మాస్ యాక్షన్ ఎంటర్టైనర్...
- January 17, 2017
గోపీచంద్, హన్సిక, కేథరిన్ థ్రెస్సా హీరోహీరోయిన్లుగా, సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'థారులాండ్, హైదరాబాద్లో మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన చివరి షెడ్యూల్ ఫిబ్రవరి 20 వరకు జరుగుతుంది. ఇందులో గోపీచంద్, హన్సిక, కేథరిన్ థ్రెస్సాలపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతోపాటు పతాక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. రామ్-లక్ష్మణ్ల అధ్వర్యంలో చిత్రీకరించనున్న యాక్షన్ సీన్స్ సినిమాకు హైలైట్గా నిలువనున్నాయి.
దర్శకుడు సంపత్నంది పోరాట సన్నివేశాలతోపాటు ఎమోషనల్ సీన్స్ను హ్యాండిల్ చేసే విధానం, ఆ సన్నివేశాల్ని మా సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ కెమెరాతో బంధించిన తీరు ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. విశేషంగా అలరిస్తుంది. ఈ సినిమాలో గోపీచంద్ స్టయిలీష్గా కనిపిస్తారు. సంపత్ నంది మార్క్, పవర్ఫుల్ టైటిల్తోపాటు గోపీచంద్ స్టయిలీష్ లుక్ను త్వరలో విడుదల చేస్తాం.
అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మా బ్యానర్ విలువను పెంచుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈచిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తాం' అని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









