ఆద్యంతం వినోదాత్మకం...
- January 17, 2017
రాజ్ తరుణ్, అను ఇమ్మాన్యుయల్ జంటగా వంశీ కృష్ణ దర్శకత్వంలో
ఏ టీవీ సమర్పణలో ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత రామబ్రహ్మం సుంకర చెబుతూ, ' 'ఈడోరకం-ఆడోరకం' తర్వాత మా బ్యానర్లో రాజ్తరుణ్ నటిస్తున్న చిత్రమిది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో రాజ్ తరుణ్ కుక్కలను కిడ్నాప్ చేసే యువకుడి పాత్రలో కనిపిస్తాడు. డబ్బు కోసం కుక్కులను కిడ్నాప్ చేయడమే కాకుండా ప్రేమ కోసం ఏం చేశాడనేది తెరపైనే చూడాలి. అనేక మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆసక్తికరంగా సాగుతుంది.
ఇటీవల 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి హిస్టారికల్ చిత్రానికి సంభాషణలు రాసి మెప్పించిన సాయిమాధవ్ ఈ సినిమాకు ఫన్నీ డైలాగులు అందించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం విశేషం. అనూప్ రూబెన్స్ అద్భుతమైన బాణీలను సమకూర్చారు. సినిమాను ఫిబ్రవరి 17న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









