30,000 దిర్హామ్ల లంచం తీసుకున్న ఎమిరేటీ అధికారి..
- January 18, 2017
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ అధికారి 30,000 దిర్హామ్ల లంచం 9 మంది వ్యక్తుల నుంచి తీసుకున్నట్లుగా తేలింది. ఎగ్జిట్ పాస్లు ఇచ్చేందుకుగాను ఆ అధికారి ఈ లంచాన్ని తీసుకున్నారు. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్, 35 ఏళ్ళ ఎమిరేటీ అధికారిని దోషిగా తేల్చింది. ఫాలో అప్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో ఈ అధికారి పనిచేస్తున్నారు. 445,700 దిర్హామ్ల విలువైన ఎక్స్పైర్డ్ రెసిడెన్సీ వీసా మరియు డిపాచ్యూర్ ఫీజుల్ని మాఫీ చేసేందుకుగాను ఆ అధికారి లంచం తీసుకున్నారు. 2015, డిసెంబర్ 24 నాటి ఘటన ఇది. ఈ ఘటనలో మధ్యవర్తిగా వ్యవహరించిన 35 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. లంచం ఇవ్వజూపినవారిలో నలుగురు బంగ్లాదేశీలు, ఇద్దరు పాకిస్తానీలు, ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు. చట్ట వ్యతిరేకంగా ఎగ్జిట్ పాస్లు ఇవ్వడం, ఫోర్జరీకి పాల్పడటం తదితర నేరాలు నిందితుడిపై మోపబడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..









