కలుషిత ఆహరం తిని ఆసుపత్రి పాలైన 150 మంది మూతపడిన టేఫ్ రెస్టారెంట్..

- January 18, 2017 , by Maagulf
కలుషిత ఆహరం తిని ఆసుపత్రి పాలైన 150 మంది  మూతపడిన టేఫ్ రెస్టారెంట్..

స్థానిక టేఫ్ రెస్టారెంట్ లో కలుషిత ఆహరం తినడంతో150 మంది వినియోగదారులను వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు కొందరు కార్మికులు పేర్కొన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క నియంత్రణ కేంద్రంకు సోమవారం 7:45 గంటలకు ఒక ఫోన్ కాల్ రావడంతో అక్కడకు వేంటనే చేరుకున్నట్లు పేర్కొన్నారు. కలుషిత ఆహారం తిన్న 36 మందిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆహరం కలుషితమైనట్లు ఆసుపత్రి నుండి హెచ్చరిక అందుకున్న అధికారిక మంత్రిత్వ శాఖ 150 బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వీరికి తక్షణ చికిత్స నిమిత్తం15 వైద్య బృందాలు తరలించినట్లు తెలిపారు.150 కేసులలో తొమ్మిది కేసులను సమీపంలోని వైద్య క్లినిక్లు లో చేర్పించారు. మిగిలిన 141 మంది బాధితులను అత్యవసర చికిత్స కోసం వివిధ ఆసుపత్రులకు తరలించారు. " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిసిన తాజా సమాచారం ప్రకారం, పలువురు రోగులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగిలిన ఇతరులకు మెరుగైన  వివిధ సౌకర్యాలు కల్పించి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరుగురు పిల్లలు చిన్న పిల్లల ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. మరో 45 మంది రోగులను  తుర్బాహ్ హాస్పిటల్ లో పరిశీలన నిమిత్తం ఉంచబడ్డారు. అదేవిధంగా కీయహ్ ఆసుపత్రిలో19 మంది, ఖుర్మా ఆసుపత్రిలో ఏడుగురు రోగులు ఆసుపత్రిలో వైద్యం చేశారు.  వైద్య చికిత్స తర్వాత  73 మంది రోగులను ఇంటికి పంపించివేశారు. అధికారిక ఆహార దుకాణాలు స్థానిక అధికారిక నిబంధనలు ఏ అతిక్రమించిందని తేలింది. దీనితో ఆ రెస్టరెంట్ పై  చట్టపరమైన చర్య  యజమాని వ్యతిరేకంగా చర్యలు స్థానిక తీసుకుంటామని చెప్పారు. మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆ ఆహార పదార్థంపై పరీక్షలు జరిపేందుకు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com