ఎయిరిండియా సిబ్బందికి జీతాలు పెంపు...

- January 20, 2017 , by Maagulf
ఎయిరిండియా సిబ్బందికి జీతాలు పెంపు...

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సిబ్బందికి జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సుమారు ఏడేళ్ల శాశ్వత సిబ్బందికి 2శాతం జీతాలు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. తగ్గిన ఇంధన ధరలు, పెరిగిన ప్రయాణికుల సంఖ్య నేపథ్యంలో దశాబ్దం తర్వాత ఎయిర్‌ ఇండియా తొలిసారిగా గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.105కోట్ల లాభాలను అర్జించింది. దీంతో ఉద్యోగుల జీతాలను 2శాతం పెంచుతున్నట్లు ఎయిర్‌ ఇండియా ఈడీ జయచంద్రన్‌ ప్రకటించారు. ఈ పెంపు 2017 ఏప్రిల్‌ 1 నుంచి అమలు కానుంది. ఎయిరిండియాలో సుమారు 19వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. . 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com