భారత ఐటీ వర్గాలకు గడ్డుకాలం రానుందా?
- January 20, 2017
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారత ఐటీ వర్గాలకు గడ్డుకాలం రానుందా? తమకు చెందాల్సిన ఉద్యోగాలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ అమెరికన్ కాంగ్రెస్లో హెచ్-1బీ వీసాపై నిబంధనలను కఠినతరం చేసేలా అక్కడి సెనేటర్లు కీలక బిల్లులను తీసుకొస్తున్నారు. తాజాగా రానున్న మరో బిల్లు సైతం భారత ఐటీ వర్గాలకు చేదు గుళికలాంటిదే. ఇది ఆమోదం పొందితే విదేశీయులైనా.. అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారికే ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
సెనేటర్లు చుక్ గ్రాసెల్లే, డిక్ డర్బన్లు ఇందుకు సంబంధించిన బిల్లును కాంగ్రెస్లో ప్రతిపాదించారు.
దీని ప్రకారం తొలిసారి హెచ్-1బీ వీసా వార్షిక కేటాయింపులను అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్ సేవల ప్రాధాన్యం ఆధారంగా కేటాయిస్తారు. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదివిన ఉత్తమ, అత్యుత్తమ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని సెనేటర్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉన్నత విద్య పట్టభద్రులై అధిక వేతనం పొందుతున్నవారు, నాణ్యమైన నైపుణ్యాలు కలిగిన వాళ్లకు సైతం అవకాశం కల్పించనున్నారు.
'అమెరికా పరిశ్రమల్లో అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన వారిని ఎంచుకునేందుకు కాంగ్రెస్ ఈ కార్యక్రమాన్ని సృష్టించింది. అంతేకానీ వేరొకరితో ఆ స్థానాలను భర్తీ చేయడానికి కాదు. దురదృష్టవశాత్తూ కొన్ని అమెరికన్ కంపెనీలు ఇక్కడి వారిని ఉద్యోగాల నుంచి తప్పించి ఇతర దేశాల నుంచి వచ్చి తక్కువ వేతనానికి పనిచేసే శ్రామికులను నియమించుకుంటున్నాయి' అని గ్రాసెల్లే అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







