తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు..
- January 22, 2017
చెన్నై : తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఆదివారం జల్లికట్టును నిర్వహించారు. తిరుచిరాపల్లి సహా చాలా చోట్ల సంప్రదాయబద్ధంగా ఎద్దులతో పోరాడారు. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి అళంగనళ్ళూరులో జల్లికట్టును ప్రారంభించవలసి ఉంది. కానీ అక్కడి ప్రజలు తమకు శాశ్వత పరిష్కారం కావాలని, తాత్కాలిక ఆర్డినెన్స్ కాదని పట్టుబట్టడంతో జల్లికట్టు రద్దయింది. దీంతో ఆయన దిండిగల్లులో జల్లికట్టును ప్రారంభిస్తారని సమాచారం. తిరుచిరాపల్లిలోని మనపురాయ్లో జల్లికట్టు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది ప్రజలు సంతోషంతో కేరింతలు కొట్టారు. దూసుకొస్తున్న ఎద్దును అదుపు చేసేందుకు యువకులు సాహసోపేతంగా ప్రయత్నించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









