లష్కరే తోయిబా ఉగ్రవాదులకు మరణశిక్ష
- January 22, 2017
పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులకు పశ్చిమబెంగాల్ స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది. పాక్కు చెందిన మొహమద్ యూనస్, అబ్దుల్లాతో పాటు భారతీయుడైన ముజఫర్ అహ్మద్ రాథోడ్ను 2007లో బీఎస్ఎఫ్ జవాన్లు భారత్-బంగ్లా సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు.
భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారని వీరిపై నమోదైన కేసును విచారించిన పశ్చిమబెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బాన్గాన్లోని న్యాయస్థానం వీరికి మరణశిక్ష విధించింది. అబ్దుల్లా కరాచీ నివాసి కాగా, యూనస్ స్వస్థలం హరిపూర్ అని చెప్పారు. ఇక రాథోడ్ జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ నుంచి వచ్చాడు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









