'మంచు' ఫ్యామిలీ దండయాత్ర!...
- January 23, 2017
కొన్ని రోజులుగా సైలెంట్గా ఉన్న 'మంచు' కుటుంబం వచ్చే నెలలో తన ప్రతాపాన్ని చూపడానికి సిద్ధమైపోతోంది. బాక్సాఫీస్పై 'మంచు'వారి దండయాత్ర మొదలవబోతోంది. గతేడాది మంచు విష్ణు, మనోజ్, లక్ష్మిలకు కొన్ని నిరాశాజనకమైన ఫలితాలు ఎదురయ్యాయి. దీంతో వారు 2017లో తమ సత్తా చాటడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ముగ్గురూ ఒక నెలలోనే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. రాజాకిరణ్ దర్శకత్వంలో మంచు విష్ణు నటించిన చిత్రం 'లక్కున్నోడు'. హన్సిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్ 'ఢీ' తరహాలో విష్ణుకు మరో విజయాన్ని అందిస్తుందని నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్.
ఇక, ఆ తర్వాత వారం మంచు మనోజ్ 'గుంటూరోడు'గా అభిమానులను పలకరించనున్నాడు. ఇటీవల విడుదలైన ట్రైలర్తోనే మాస్ ప్రేక్షకులను అలరించిన 'గుంటూరోడు' ఫిబ్రవరి 10న థియేటర్లలోకి రానున్నాడు. ఇక, మంచు లక్ష్మి లీడ్ రోల్లో నటించిన 'లక్ష్మీబాంబ్' కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నిజానికి ఈ సినిమా మూణ్నెళ్ల కిందటే రావాల్సింది.
కానీ, నోట్ల రద్దు, పెద్ద సినిమాల విడుదల వంటి కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. మరి, ఫిబ్రవరి నెల మంచు ఫ్యామిలీకి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







