నేడు 7/11 ముంబై నిందితులకు శిక్ష ఖరారు!
- September 14, 2015
2006లో ముంబయి సబర్బన్ రైలులో సంభవించిన పేలుళ్ల ఘటనకు సంబంధించి న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో 12మందిని ముంబయి న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొనగా అబ్దుల్ వహీద్ షేక్ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. నిందితులకు ఉరిశిక్ష, జీవితఖైదు విధించే అవకాశం ఉంది.2006 జులై 11న 11 నిమిషాల వ్యవధిలో 7సార్లు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 189 మంది మృతిచెందగా... 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ భయంకర ఘటన దేశాన్ని కుదిపేసింది. ప్రెసర్ కుక్కర్లో ఆర్డీఎక్స్ బాంబులను అమర్చి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును తొమ్మిదేళ్ల పాటు విచారించిన ముంబయిలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కోర్టు ఎట్టకేలకు దోషులను నిర్ధారించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 192 మందిని విచారించింది. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖ, న్యాయ శాఖ, వైద్యాధికారులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









