నేడు 7/11 ముంబై నిందితులకు శిక్ష ఖరారు!
- September 14, 2015
2006లో ముంబయి సబర్బన్ రైలులో సంభవించిన పేలుళ్ల ఘటనకు సంబంధించి న్యాయస్థానం ఈరోజు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో 12మందిని ముంబయి న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొనగా అబ్దుల్ వహీద్ షేక్ అనే వ్యక్తిని కోర్టు నిర్దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. నిందితులకు ఉరిశిక్ష, జీవితఖైదు విధించే అవకాశం ఉంది.2006 జులై 11న 11 నిమిషాల వ్యవధిలో 7సార్లు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 189 మంది మృతిచెందగా... 800 మందికి పైగా గాయపడ్డారు. ఈ భయంకర ఘటన దేశాన్ని కుదిపేసింది. ప్రెసర్ కుక్కర్లో ఆర్డీఎక్స్ బాంబులను అమర్చి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ కేసును తొమ్మిదేళ్ల పాటు విచారించిన ముంబయిలోని ప్రత్యేక మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కోర్టు ఎట్టకేలకు దోషులను నిర్ధారించింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ 192 మందిని విచారించింది. వీరిలో ఐఏఎస్, ఐపీఎస్, రక్షణ శాఖ, న్యాయ శాఖ, వైద్యాధికారులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్







