ఈజిప్ట్ లో ఉగ్రవాదులనుకొని పర్యాటకులని చంపిన వైనం
- September 13, 2015
ఈజిప్టు భద్రతా బలగాలు ఘోర తప్పిదానికి పాల్పడ్డాయి. ఉగ్రవాదులను హతమార్చేందుకు వారిని వెంటాడుతూ ఆ క్రమంలో పన్నెండు మంది పర్యాటకులను అనుకోకుండా కాల్చి చంపారు. ఈ ఘటన సంచలనానికి తెరతీసింది. పోలీసులు, సైనిక దళాలు ఆదివారం సాయంత్రం ఉమ్మడి ఉగ్రవాద నిరోధక చర్యలకు దిగాయి. ఈ క్రమంలో ఏడారిలో నిషేధిత ప్రాంతమైనా అల వాహత్ లో నాలుగు వాహనాల్లో మెక్సికన్ టూరిస్టులు అనుకోకుండా వచ్చారు. దీంతో అప్పటి వరకు ఉగ్రవాదులను వెంటాడిన భద్రతా బలగాలు ఆ తర్వాత కూడా వారు ఉగ్రవాదులే అనుకుని భ్రమపడి మెక్సికో పర్యాటకుల వాహనాలపై కాల్పులు జరిపారు. దీంతో 12 మంది మెక్సికో టూరిస్టులు ప్రాణాలు కోల్పోగా మరో పది మంది మెక్సికో, ఈజిప్టు టూరిస్టులు గాయాలపాలయ్యారు. ఈజిప్టుకు ప్రధాన ఆదాయం టూరిజం నుంచి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన కొంత ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. అయితే, మెక్సికో మాత్రం ఈ అంశాన్నిఇంకా ధృవీకరించలేదు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







