బహ్రైన్ లో బాంబు భయం - నిలిచిపోయిన ట్రాఫిక్
- September 14, 2015
వివిధ ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులు కనిపించిన నేపధ్యంలో బహ్రైన్ అంతటా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిన్న ఉదయం 6 30 గంటలకు షేక్ ఈ సా బిన్ సల్మాన్ హైవే వెంబడి సలమాబాద్ ఇంటర్శెక్షన్ వద్ద అనుమానాస్పద వస్తువు కనబడడంతో మొదలైన ఈ ప్రహసనం, జనాబియా, హిద్ద్ వంటి ప్రాంతాలలో కూడా ఇదే విధంగా జరగడంతో ఇంచుమించు 3 గంటలపాటు నిలిచిపోయిన ట్రాఫిక్ వలన వాహనాలు బారులు తీరాయి. మనామా నుండి సిట్రా మరియు మీన సల్మాన్ కు, ఉమ్మ్ అల్ హస్సన్ ఎవెన్యు నుండి సలమాబాద్ ఇంటర్శెక్షన్ కు వెళ్లే దారులు పోలీసులచే నిరోధించబడ్డాయి. బుదైయ హైవే, జనాబియా మరియు అల్ క్వెర్రీ గ్రామాలను కూడా మూసివేశారు. ఈ నేపధ్యంలో అనేక మంది పిల్లలు, ఉద్యోగస్తులు, ఇతర పనుల మీద వెళ్ళేవరికి తీవ్ర ఇబ్బంది ఎదురవగా, కొన్ని పాఠశాలలు మాత్రం 10 గంటల నుండి తరగతులు ప్రారంభి స్తామని ప్రకటించడం కొంత ఓదార్పు.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రైన్)
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







