మన చేనేతను ప్రమోట్ చేసిన కేటీఆర్ జపాన్లో...
- January 24, 2017
ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆలోమోబైల్ తయారీ రంగాల్లో పెట్టుబడులు ఆహ్వానించేందుకు మంత్రి జపాన్లో పర్యటిస్తున్నారు. పనిలోపనిగా చేనేతను ప్రమోట్ చేసేందుకు ఉన్న అవకాశాలను మంత్రి ఉపయోగించుకుంటున్నారు. జపాన్లో పర్యటిస్తున్న మంత్రి ఆ దేశ అతి పెద్ద వస్త్ర వ్యాపార సంస్థ అయిన ముజీ డైరక్టర్ షిమిజును కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ పోచంపల్లి చేనేతను పరిచయం చేశారు. సిల్క్ చీరను, శాలువాను ఆయనకు బహుకరించారు.
చేనేత కార్మికులను ఆదుకునేందుకు, వారు నేస్తున్న చేనేత వస్త్రాలకు విక్రయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేనేత లక్ష్మీ పథకంను తీసుకు వచ్చింది. ఇటీవల అసెంబ్లీలో సైతం చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రజాప్రతినిధులంతా చేనేత వస్త్రాలు ధరించాలని ఇప్పటికే పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







