న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజుకు ఘన స్వాగతం పలికిన మోదీ

- January 24, 2017 , by Maagulf

భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం చెప్పారు. భారత్‌లో ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు రేపు అధికార లాంఛనాలతో స్వాగతం చెబుతారు. ఆ తర్వాత యువరాజు బాపూఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీతో కూడా అబుధాబి యువరాజు సమావేశమౌతారు.

మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్‌కు ఆహ్వానం పలుకుతూ ప్రధాని మోదీ అరబిక్ భాషలో ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com