న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజుకు ఘన స్వాగతం పలికిన మోదీ
- January 24, 2017
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం చెప్పారు. భారత్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. రాష్ట్రపతి భవన్లో ఆయనకు రేపు అధికార లాంఛనాలతో స్వాగతం చెబుతారు. ఆ తర్వాత యువరాజు బాపూఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీతో కూడా అబుధాబి యువరాజు సమావేశమౌతారు.
మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్కు ఆహ్వానం పలుకుతూ ప్రధాని మోదీ అరబిక్ భాషలో ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు.

తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









