న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజుకు ఘన స్వాగతం పలికిన మోదీ
- January 24, 2017
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం చెప్పారు. భారత్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. రాష్ట్రపతి భవన్లో ఆయనకు రేపు అధికార లాంఛనాలతో స్వాగతం చెబుతారు. ఆ తర్వాత యువరాజు బాపూఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీతో కూడా అబుధాబి యువరాజు సమావేశమౌతారు.
మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్కు ఆహ్వానం పలుకుతూ ప్రధాని మోదీ అరబిక్ భాషలో ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు.

తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







