న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజుకు ఘన స్వాగతం పలికిన మోదీ
- January 24, 2017
భారత గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు న్యూఢిల్లీ చేరుకున్న అబుధాబి యువరాజు మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం చెప్పారు. భారత్లో ఆయన మూడు రోజుల పాటు పర్యటిస్తారు. రాష్ట్రపతి భవన్లో ఆయనకు రేపు అధికార లాంఛనాలతో స్వాగతం చెబుతారు. ఆ తర్వాత యువరాజు బాపూఘాట్కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పిస్తారు. రేపు మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమౌతారు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రేపు సాయంత్రం ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీతో కూడా అబుధాబి యువరాజు సమావేశమౌతారు.
మహ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్కు ఆహ్వానం పలుకుతూ ప్రధాని మోదీ అరబిక్ భాషలో ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు.

తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









